తెలంగాణ

telangana

ETV Bharat / state

మాజీ మంత్రి రత్నాకర్​రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం - మాజీ మంత్రికి సీఎం కేసీఆర్ సంతాపం

అనారోగ్యంతో కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు మృతి చెందారు. ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.

kcr
రత్నాకర్​రావుకు సీఎం కేసీఆర్ సంతాపం

By

Published : May 10, 2020, 10:55 AM IST

మాజీ మంత్రి రత్నాకర్ రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. రత్నాకర్ రావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ సోమేశ్​కుమార్​ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, జీవన్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తదితరులు కూడా రత్నాకర్​ రావు మృతి పట్ల సంతాపం తెలిపారు.

జువ్వాడి రత్నాకర్​ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఉమ్మడి కరీంనగర్​ జిల్లా బుగ్గారం నియోజకర్గం నుంచి 1989, 1999, 2004లో గెలుపొందారు.

ఇవీ చూడండి: మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు మృతి

ABOUT THE AUTHOR

...view details