తెలంగాణ

telangana

ETV Bharat / state

పంట కొనుగోలు చేసి రైతులను ఆదుకోండి - Buy the crop and save the farmers in Karimnagar district

కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్​లో తడిసిన వరి ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులను  కోరారు.

పంట కొనుగోలు చేసి రైతులను ఆదుకోండి

By

Published : Nov 6, 2019, 5:59 PM IST

ఖరీఫ్ పంట ధాన్యాన్ని సత్వరం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం కోరారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్​లో పక్షం రోజులుగా ధాన్యం కొనుగోళ్లకు ఎదురుచూస్తున్న రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తేమతో సంబంధం లేకుండా మార్కెట్​కు తరలించిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా కొనుగోలు చేయాలని అధికారులను కోరారు. ధాన్యం కొనుగోళ్లలో ఉదాసీనంగా వ్యవహరిస్తే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు.

పంట కొనుగోలు చేసి రైతులను ఆదుకోండి

ABOUT THE AUTHOR

...view details