తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్కడ 108 సిబ్బంది.. ఇక్కడ వైద్యులు - hospital

కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​ మండలం నుస్తులాపూర్​ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 108 సిబ్బంది, పోలీసులు, వైద్యులు సరిగా స్పందించలేదని బాధితులు వాపోయారు.

అక్కడ 108 సిబ్బంది.. ఇక్కడ వైద్యులు

By

Published : May 12, 2019, 5:00 PM IST

హైదరాబాద్​ నుంచి మెట్​పల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు కరీంనగర్​ జిల్లా నుస్తులాపూర్​ వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు. నిన్న రాత్రి 10 గంటలకు ఎంజీబీఎస్​ నుంచి బయలు దేరిన బస్సు సుమారు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. 3 గంటల వరకు ఎన్నిసార్లు 108 సిబ్బంది, పోలీస్​ సిబ్బందికి ఫోన్​చేసినా స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. చివరికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా.. ఇక్కడ సిబ్బంది సైతం పట్టించుకోవడం లేదని వాపోయారు. గాయపడ్డవారిలో కొంతమందికి కాళ్లు విరిగాయి. ఒ మహిళ కంటికి తీవ్ర గాయాలయ్యాయి.

అక్కడ 108 సిబ్బంది.. ఇక్కడ వైద్యులు

ABOUT THE AUTHOR

...view details