తెలంగాణ

telangana

ETV Bharat / state

'అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు'

రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని భాజపా మహిళా మోర్చా సభ్యులు వ్యాఖ్యానించారు. భైంసా ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కరీంనగర్​లో రాస్తారోకో నిర్వహించారు.

By

Published : Mar 18, 2021, 5:50 PM IST

bjp protest at karimnagar
'అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు'

భైంసాలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్​లో భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేపట్టారు. ఎన్టీఆర్​ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... రాస్తారోకో నిర్వహించారు. దీంతో రెండు గంటలు ట్రాఫిక్ స్తంభించింది.

రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని భాజపా రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి సామ్రాజ్య లక్ష్మి వ్యాఖ్యానించారు. ఈ ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని... లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:అనారోగ్యంతో అర్జున అవార్డు గ్రహీత కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details