తెలంగాణ

telangana

ETV Bharat / state

'బీసీలపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది' - Karimnagar District Latest News

గొల్ల కురుమలకు సబ్సిడీ గొర్రెలను అందించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్​ జిల్లా కలెక్టర్​కు భాజపా నేతలు వినతి పత్రం అందజేశారు. బీసీలపై తెరాస ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ ఆరోపించారు. బీసీల సమస్యలు పట్టించుకునే వారే రాష్ట్రంలో లేరని విమర్శించారు.

BJP leaders demanded that subsidized sheep be provided to golla kurmas
బీసీలపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది

By

Published : Mar 2, 2021, 7:45 PM IST

బీసీలపై తెరాస ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ ఆరోపించారు. వారిపట్ల చిత్తశుద్ధి లేదని.. అణగారిన వర్గాల కోసం ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శించారు.

గొల్ల కురుమలకు సబ్సిడీ గొర్రెలు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్​కు వినతి పత్రం అందించారు. అటెండర్ నుంచి గెజిటెడ్ అధికారి పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చదివించేలా దేశ వ్యాప్తంగా చట్టాలు సరళతరం చేయాలని డిమాండ్ చేశారు. విద్య అనేది అప్పుడే అందరికీ అందుతుందన్నారు.

రాష్ట్రంలో బీసీ ఈ లోన్స్ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బీసీల సమస్యలు పట్టించుకునే వారే రాష్ట్రంలో లేరని విమర్శించారు.

ఇదీ చూడండి:మూడుసార్లు ఎమ్మెల్యే.. అయినా ఇల్లు లేదు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details