తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంపీ అర్వింద్​పై దాడికి నిరసనగా భాజపా ఆందోళన - BJP Leaders Strike latest news

నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​పై వరంగల్​లో జరిగిన దాడికి నిరసనగా హుజూరాబాద్​లో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

BJP Activities Strike For Attack on Nizamabad MP Dharmapuri Aravind in Huzurabad
ఎంపీ అర్వింద్​పై దాడికి నిరసనగా భాజపా నిరసన

By

Published : Jul 13, 2020, 4:45 PM IST

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్​పై దాడికి నిరసనగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్​లో‌ భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దాడికి పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్సై శ్రీనివాస్‌ తన సిబ్బందితో అక్కడకు చేరుకొన్నారు. భాజపా నాయకులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details