తెలంగాణ

telangana

ETV Bharat / state

బాహుబలి ఆరో పంపు వెట్​రన్​ విజయవంతం - Bahubali Sixth Pump Vet Run Successful

కరీంనగర్​ జిల్లాలోని లక్ష్మీపూర్​ వద్ద గల గాయత్రి పంప్​హౌస్​లోని ఆరో బాహుబలి పంపు వెట్​రన్​ విజయవంతమైంది. ఇప్పటికే నాలుగు పంపుల పరీక్ష విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. ఈ పంపులతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి నీళ్లు మళ్లించనున్నారు.

bahubali-sixth-pump-vet-run-successful

By

Published : Sep 18, 2019, 4:01 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు గాయత్రి పంప్​హౌస్​లోని బాహుబలి ఆరో పంపు వెట్​రన్ విజయవంతమైంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ వద్ద గల గాయత్రి పంప్​హౌస్​లో ఇప్పటి వరకు మొత్తం నాలుగు బాహుబలి పంపులను ఎత్తిపోతలకు వినియోగించారు. ఆగస్టులో గాయత్రి పంప్​హౌస్ నుంచి మధ్య మానేరు ప్రాజెక్టుకు సుమారు 13 టీఎంసీల నీటిని తరలించారు. తాజాగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి నీటిని మళ్లించేందుకు వెట్​రన్ నిర్వహించారు. ఎత్తిపోతల అవసరం అంతగా లేకపోవటం వల్ల కొన్ని గంటల్లోనే బాహుబలి పంపును నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల ముఖ్య సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్ వెట్​రన్​ను పర్యవేక్షించారు.

బాహుబలి ఆరో పంపు వెట్​రన్​ విజయవంతం

ABOUT THE AUTHOR

...view details