తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్టును ఢీ కొట్టిన కారు... ఇద్దరి పరిస్థితి విషమం

కరీంనగర్ జిల్లా వేములవాడ నుంచి కొండగట్టుకు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి.

By

Published : Apr 30, 2019, 6:05 PM IST

చెట్టును ఢీ కొట్టిన కారు

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం వద్ద కారు ప్రమాదం జరిగింది. కేశవపట్నం మండలం కరీంపేటకు చెందిన పాలేటి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు దర్శనానికి వెళ్లొస్తున్నారు. ప్రమాదవశాత్తు కారు టైరు పేలి చెట్టును ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని 108సిబ్బంది సహాయంతో కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చెట్టును ఢీ కొట్టిన కారు

ABOUT THE AUTHOR

...view details