తెలంగాణ

telangana

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

ఓ రైతు వద్ద నుంచి సర్వేయర్‌ లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన కరీంనగర్​ జిల్లా ఇల్లందకుంటలో జరిగింది. నిందితుడిని శుక్రవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని డీఏస్పీ భద్రయ్య తెలిపారు.

By

Published : Jan 23, 2020, 7:30 PM IST

Published : Jan 23, 2020, 7:30 PM IST

acb offcial catch survayar for tooke bribe
ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

కరీంనగర్​ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన ఎగుర్ల రాజుకు కొంత భూమి ఉంది. భూమిని సర్వే చేయించేందుకు సర్వేయర్​ ముబీన్​ను​ ఆశ్రయించారు. రూ.10 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్​ చేశారు ముబీన్​. అంగీకరించిన రైతు.. ఏసీబీ అధికారులను సంప్రదించారు. జమ్మికుంట బస్టాండ్​ సమీపంలో రైతు నుంచి రూ.7వేలు తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు ముబీన్​ను పట్టుకున్నారు. నిందితుడిని శుక్రవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని డీఏస్పీ భద్రయ్య తెలిపారు.

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

ABOUT THE AUTHOR

...view details