కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన ఎగుర్ల రాజుకు కొంత భూమి ఉంది. భూమిని సర్వే చేయించేందుకు సర్వేయర్ ముబీన్ను ఆశ్రయించారు. రూ.10 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు ముబీన్. అంగీకరించిన రైతు.. ఏసీబీ అధికారులను సంప్రదించారు. జమ్మికుంట బస్టాండ్ సమీపంలో రైతు నుంచి రూ.7వేలు తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు ముబీన్ను పట్టుకున్నారు. నిందితుడిని శుక్రవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని డీఏస్పీ భద్రయ్య తెలిపారు.
ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి
ఓ రైతు వద్ద నుంచి సర్వేయర్ లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో జరిగింది. నిందితుడిని శుక్రవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని డీఏస్పీ భద్రయ్య తెలిపారు.
ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి