తెలంగాణ

telangana

అంబులెన్స్​లో ప్రసవం... తల్లీబిడ్డా క్షేమం

By

Published : Jan 5, 2021, 1:47 PM IST

ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఓ మహిళ అంబులెన్స్​లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 వాహన సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని తెలిపారు.

a-woman-delivery-in-ambulance-in-karimnagar-district
అంబులెన్స్​లో ప్రసవం... తల్లీబిడ్డా క్షేమం

కాన్పు కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్​లోనే ఓ మహిళ ప్రసవించింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన జ్యోతిని 108 వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ విద్యాసాగర్, పైలట్ వెంకటేశ్వర రెడ్డి సాయంతో అంబులెన్స్​లోనే ఆమెకు సోమవారం రాత్రి కాన్పు చేశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారని... ఇద్దరినీ కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కాన్పు చేసిన సిబ్బందిని సూపర్​వైజర్ బోయిని సంపత్, తోటి ఉద్యోగులు అభినందించారు.

ఇదీ చదవండి:శివగామిలా పిల్లల్ని రక్షించాడు.. కానీ చివరకు...

ABOUT THE AUTHOR

...view details