కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్లో డీఆర్డీఓ ఉపాధి హామీ పనుల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవిలో ఉపాధి హామీ కూలీలకు 30 శాతం అదనంగా చెల్లించనున్నామని డీఆర్డీఓ వెంకటేశ్వర రావు వెల్లడించారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కూలీల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
ఉపాధి హామీ కూలీలకు 30 శాతం అదనపు చెల్లింపులు - ఉపాధి హామీ కూలీలకు 30 శాతం అదనపు చెల్లింపులు
కరీంనగర్ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరానికి 55 లక్షల 28 వేల పని దినాలు లక్ష్యంగా నిర్దేశించినట్లు డీఆర్డీఓ వెంకటేశ్వర రావు పేర్కొన్నారు.
![ఉపాధి హామీ కూలీలకు 30 శాతం అదనపు చెల్లింపులు UPADHI HAMEE MEETING](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6832349-647-6832349-1587133091859.jpg)
ఉపాధి హామీ కూలీలకు 30 శాతం అదనపు చెల్లింపులు
సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూనే ప్రభుత్వ నిబంధనల మేరకు పనులు చేపట్టాలని సూచించారు. ఇంకుడు గుంతలు, పొలాల వద్ద ఫీల్డ్ చానల్స్, ఫీడర్ చానల్స్ , నీటి కుంటలు తదితర పనులను చేపట్టేందుకు ఉపాధి హామీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ మాస్కులు ధరించే విధంగా జాగ్రత్త పాటించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ మంజులాదేవి, ఏపీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి:లాక్డౌన్ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్