తెలంగాణ

telangana

ETV Bharat / state

'నీళ్లు తీసుకొచ్చి కామారెడ్డి కన్నీళ్లు తుడవాలి' - కామారెడ్డి జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం

కామారెడ్డికి కాళేశ్వరం నీళ్లని తీసుకొచ్చి జిల్లా ప్రజల కన్నీళ్లు తుడవాలని జిల్లా సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే హన్మత్ షిండే కోరారు.

'నీళ్లు తీసుకొచ్చి కామారెడ్డి కన్నీళ్లు తుడవాలి'

By

Published : Oct 25, 2019, 9:17 AM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వెల్మ ఫంక్షన్ హాల్​లో గురువారం జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్, హన్మంత్ షిండే, జాజుల సురేందర్, రాజేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో పింఛన్​ డబ్బులను రాత్రి 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పంచుతున్నారని... ఇక నుంచి అలా రాత్రుళ్లు పంచకుండా చూడాలని కోరారు. కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి కామారెడ్డి ప్రజల కన్నీళ్లు తుడవాలని కోరారు.

'నీళ్లు తీసుకొచ్చి కామారెడ్డి కన్నీళ్లు తుడవాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details