తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై మహిళ ఫిర్యాదు.. - political war in kamareddy

నిజామాబాద్​ కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్​ ఎన్నికల్లో టికెట్​ ఇస్తానని ఆశచూపి ఇవ్వలేదని... తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్​ నాయకులు ఈ ఆరోపణలు ఖండించారు. అవన్నీ నిరాధార ఆరోపణలంటూ తోసిపుచ్చారు.

women complaint on nizamabad congress mlc candidate
women complaint on nizamabad congress mlc candidate

By

Published : Jun 24, 2020, 9:53 PM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జి వడ్డేపల్లి సుభాశ్​పై కాంగ్రెస్​ మాజీ మహిళా మండల అధ్యక్షురాలు అరుణ ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున టికెట్ ఇవ్వకుండా.. తనతో అమర్యాదగా ప్రవర్తించాడని ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అరుణ ఆరోపణలను ఖండించిన నాయకులు..

అరుణ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి ఖండించారు. మున్సిపల్ ఎన్నికల్లో అధిష్ఠానం టికెట్ నిరాకరించిందన్నారు. పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి మద్దతు తెలపకుండా... రెబెల్​గా పోటీ చేసి అభ్యర్థి ఓటమికి కారణమైనందుకు అధిష్ఠానమే పార్టీ నుంచి తొలగించిందని తెలిపారు. పార్టీ నాయకులపై అసభ్య పదజాలంతో దూషించినందుకు ఆమెపై ఫిర్యాదు చేసినట్లు జనార్దన్​రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి:పూర్తి వేతనాల చెల్లింపునకు సర్కారు ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details