తెలంగాణ

telangana

By

Published : Aug 29, 2020, 3:29 PM IST

ETV Bharat / state

ఎల్లారెడ్డి డివిజన్​ కేంద్రంలో తొలి కరోనా మరణం కేసు నమోదు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో కరోనాతో ఓ మహిళ మృతి చెందింది. చెస్ట్​ క్యాన్సర్​తో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడి మరణించింది. మున్సిపల్​ సిబ్బంది వచ్చి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.

woman dead in yellareddy news
ఎల్లారెడ్డి డివిజన్​ కేంద్రంలో తొలి కరోనా మరణం కేసు నమోదు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో మొదటి కరోనా మృతి కేసు నమోదైంది. ఓ రేషన్​ డీలర్ సతీమణి కొవిడ్​ వ్యాధితో శనివారం మృతి చెందింది. ఆమెకు చెస్ట్​ క్యాన్సర్​ ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు శుక్రవారం కరోనా నిర్ధరణ పరీక్ష చేయించగా పాజిటివ్​ అని తెలిసింది.

అప్పటిదాకా అందరితో కలిసి ఉన్న ఆమె శనివారం తెల్లవారుజామున శ్వాసతో ఇబ్బంది పడి మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మున్సిపల్ సిబ్బంది .. మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండి:మహిళల్లో కరోనా ప్రభావం తక్కువ.. కారణం అదే!

ABOUT THE AUTHOR

...view details