అయోధ్య రామమందిర నిర్మాణానికి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన తెరాస నేత, మైనారిటీ సెల్ రాష్ట్రాధ్యక్షులు ఎంకే ముజీబోద్ధిన్ రూ. 2 లక్షల 16 వేల విరాళాన్ని అందించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో జరిగిన ఓ సమావేశంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులకు చెక్కును ఆయన అంజేశారు.
రామమందిర నిర్మాణానికి ముస్లిం నేత విరాళం - రామ మందిర నిర్మాణం వార్తలు
అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కులమతాలకు అతీతంగా ప్రజలు తమకు తోచిన విధంగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా మైనారిటీ సెల్ రాష్ట్రాధ్యక్షుడు ఎంకే ముజీబోద్ధిన్ శ్రీ రామ మందిర నిర్మాణానికి తన వంతు సాయంగా రూ. 2 లక్షల 16 వేలు అందించారు.
రామమందిర నిర్మాణానికి తెరాస ముస్లిం నేత విరాళం
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు రామ మందిర నిర్మాణానికి కులమతాలకు అతీతంగా విరాళాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెరాస నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి