కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ చనిపోయిందంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసే వరకు ధర్నా ఆపేది లేదని హెచ్చరించారు. మెదక్ జిల్లా వెంకటాపూర్కి చెందిన పోచమ్మ గత కొన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతోంది. చికిత్స కోసం 15 రోజుల క్రితం ఎల్లారెడ్డి ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఇవాళ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన - ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన ఆపేది లేదని హెచ్చరించారు.

మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
Last Updated : May 30, 2019, 7:43 AM IST