కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలనే నిర్ణయంతో పట్టణంలోని స్థానిక ఆర్అండ్బీ గెస్ట్ హౌజ్లో అఖిల పక్ష నేతలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు భేటీ అయ్యారు. కరోనా వైరస్ కట్టడి కోసం స్వచ్ఛందంగా సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు.
బాన్సువాడలో పది రోజులు స్వచ్ఛంద లాక్డౌన్ - బాన్సువాడలో 7 నుంచి 17వ తేదీ వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఎలాగైనా సరే కరోనాను కట్టడి చేయాలనుకున్న అధికారులు ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు స్వచ్ఛందంగా సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు.
![బాన్సువాడలో పది రోజులు స్వచ్ఛంద లాక్డౌన్ voluntary lockdown in baswada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8278756-373-8278756-1596452690157.jpg)
బాన్సువాడలో పది రోజులు స్వచ్ఛంద లాక్డౌన్
ఈ నెల 7వ తేదీ నుంచి 17 వరకు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు. లాక్డౌన్ పాటించకుండా బయట తిరిగితే 1000 రూపాయల నుంచి 5 వేల రూపాయల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వర్తక వాణిజ్య సంస్థల యజమానులు, మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, వైస్ ఛైర్మన్ జుబెర్, కౌన్సిలర్లు, అధికారులు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..