కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ పర్యటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులను సభాపతి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను తీసుకుని స్వయంగా ఎలక్ట్రిక్ బగ్గీ కార్ నడుపుతూ పట్టణంలో కలియతిరిగారు.
బాన్సువాడలో పర్యటించిన సభాపతి పోచారం శ్రీనివాస్ - శాసన సభ స్పీకర్ తాజా వార్తలు
రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించారు. ఈ సందర్బంగా పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.
![బాన్సువాడలో పర్యటించిన సభాపతి పోచారం శ్రీనివాస్ speaker pocharam srinivas visit banswada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12133321-42-12133321-1623688938356.jpg)
బాన్సువాడలో పర్యటించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్
ఈ పర్యటనలో భాగంగా బాన్సువాడ పట్టణంలో నూతనంగా నిర్మించబోయే మున్సిపల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం సేకరించిన స్థలాన్ని సభాపతి పరిశీలించారు. అనంతరం బాన్సువాడ నూతన డీఆర్ఓ కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని అధికారులతో కలిసి సందర్శించారు.
ఇదీ చదవండి:పోడు భూములపై అటవీశాఖ అధికారుల దౌర్జన్యం.. లాక్కొవద్దని గిరిజనుల ఆవేదన