కామారెడ్డి జిల్లాలో కరోనా కట్టడిలో భాగంగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి, బాన్సువాడ పట్టణంలో మూడు ప్రాంతాలను కరోనా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 14 రోజులుగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనడం వల్ల వాటిని ఆరెంజ్ జోన్లుగా ప్రకటించారు. అక్కడ మరో 14 రోజుల పాటు పాజిటివ్ కేసులు నమోదు కాకుంటే గ్రీన్జోన్లు పరిధిలోకి తెస్తారు.
ముగిసిన క్వారంటైన్ గడువు...
విదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి 28 రోజుల క్వారంటైన్ గడువు ముగిసింది. భిక్కనూరు దక్షిణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రంలోని 15 మందికి కరోనా లక్షణాలు లేకపోవడం వల్ల వారందరినీ ఇళ్లకు పంపించి కేంద్రాన్ని ఖాళీ చేశారు.