తెలంగాణ

telangana

By

Published : Feb 17, 2021, 9:16 AM IST

ETV Bharat / state

ఎస్సీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం: మంత్రి కొప్పుల

ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ తరఫున దళితులకు 90 శాతం సబ్సిడీతో కూడిన రుణాలను అందిస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నిర్మించనున్న అంబేడ్కర్ భవన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు.

state government is working for the betterment of Dalits says Social Welfare Minister Koppula Ishwar
'దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది'

ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. బడుగు బలహీన వర్గాలను ఆదుకునేందుకు కృషి చేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రూ. కోటి నిధులతో నిర్మించనున్న అంబేడ్కర్ భవన్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు.

రాష్ట్రంలో సుమారు 236 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వం.. శాఖ తరఫున దళితులకు 90 శాతం సబ్సిడీతో కూడిన రుణాలను అందిస్తోందన్నారు. దళితుల అభ్యున్నతి కోసం.. అంబేడ్కర్ భవన నిర్మాణాన్ని చేపట్టినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ ఛైర్‌పర్సన్ శోభ రాజు, డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:నేడు సీఎం కేసీఆర్​ పుట్టినరోజు... వేడుకలకు రాష్ట్రం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details