తెలంగాణ

telangana

ETV Bharat / state

మామను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు - CRIME NEWS IN TELANGANA

కొడుకులు లేరని అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడో ఓ వ్యక్తి. కానీ అల్లుడే అతని పాలిట యముడైతాడని ఊహించలేదు. మామను గొడ్డలితో చంపిన ఘటన కామారెడ్డి జిల్లా లింగాపూర్​లో చోటుచేసుకుంది.

son-in-law-chopped-off-his-uncle-with-an-ax-at-in-lingapur-kamareddy-district
మామను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు

By

Published : Dec 3, 2019, 12:27 PM IST

కామారెడ్డి జిల్లా లింగపూర్‌ గ్రామానికి చెందిన ఎనగుర్తి రాజలింగంకు ఒకే ఒక్క కూతురు భీమవ్వ. కొడుకులు లేకపోవడంతో లింగంపేట్ మండలం ఐలపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్​ను ఇల్లరికం తెచ్చుకున్నాడు. కూతురితో కలిసి రాజలింగం ఇంట్లోనే నివసిస్తున్నాడు.

సోమవారం రాత్రి బైక్ విషయంలో మామాఅల్లుళ్లకు చిన్నపాటి గొడవ జరిగింది. ఉదయం మాట్లాడుకుందామని అనుకున్నారు. రాత్రి పదకొండు గంటలకు ఇంటి ముందు జరుగుతున్న రిసెప్షన్ వద్దకు భీమవ్వ వెళ్లింది.

మామను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు

ఇదే అదునుగా భావించిన లక్ష్మణ్ ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకుని రాజలింగం తలపై బాదాడు. రాజలింగం అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీం రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇవీచూడండి: "పూటుగా తాగాం... ఆ యువతి కనిపించగానే ఏదో ఒకటి చేయాలనుకున్నాం..."

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details