తెలంగాణ

telangana

ETV Bharat / state

శానిటరీ ఇన్​స్పెక్టర్​పై చర్యలకు పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్​ - కామారెడ్డిలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

కామారెడ్డిలో ఇంఛార్జి శానిటరీ ఇన్​స్టెక్టర్​ పర్వేజ్​పై చర్యలు తీసుకోవాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్​ చేశారు. చిన్న తప్పులను పెద్దవిగా చూపుతూ దాడులకు పాల్పడుతున్నారని కార్మికులు ఆరోపించారు.

sanitary workers strike at kamareddy
శానిటరీ ఇన్​స్పెక్టర్​పై చర్యలకు పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్​

By

Published : Jul 8, 2020, 10:50 AM IST

కామారెడ్డిలో ఇంఛార్జి శానిటరీ ఇన్​స్టెక్టర్​ పర్వేజ్​ తీరుపై కార్మికులు ఆందోళన దిగారు. మంగళవారం.. దొంగతనం నెపంతో ఓ కార్మికుడిపై పర్వేజ్​ దాడికి పాల్పడినట్లు పారిశుద్ధ్య కార్మికులు ఆరోపించారు. నిరసనగా విధులు బహిష్కరించారు. పర్వేజ్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

గత కొంతకాలంగా ఇంఛార్జి శానిటరీ ఇన్​స్పెక్టర్​ పర్వేజ్​.. కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగన్న ఆరోపించారు. చిన్న తప్పులను పెద్దవిగా చూపుతూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శేఖర్​ అనే కార్మికుడిని చెప్పులు దొంగలించాడనే ఆరోపణపై దాడికి పాల్పడినట్లు నాగన్న తెలిపారు. పర్వేజ్​పై చర్యలు తీసుకునేంతవరకు విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు. దేవునిపల్లి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదుచేసినట్లు కార్మికులు తెలిపారు.

ఇవీచూడండి:కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్త నిరసనలు: రైతు సంఘం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details