తెలంగాణ

telangana

ETV Bharat / state

సోమేశ్వర ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సభాపతి

శాసన సభాపతి పొచారం శ్రీనివాస్ రెడ్డి  కామరెడ్డి జిల్లా నసురుల్లాబాద్​లోని సోమేశ్వర దేవస్థానంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. భక్తుల అవసరాల దృష్ట్యా రూ. కోటి పదిలక్షలతో నిర్మించిన కల్యాణ మండపం, శౌచాలయాలను ప్రారంభించారు.

By

Published : Aug 27, 2019, 5:06 AM IST

సోమేశ్వర ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సభాపతి

Sabhapati is the founder of several development programs at Someshwara Temple

శ్రావణ మాసం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర ఆలయంలో పలు అభివృద్ధి పనులను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా నసురుల్లబాద్​ మండలం దుర్కిలో కొలువై ఉన్న స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో టూరిజం డెవలప్​మెంట్ ఫండ్ కింద రూ.కోటి పది లక్షలతో నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, పరిషత్ ఛైర్మన్ శ్రీమతి ధపెదర్​ శోభరాజు, బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్, డిఎస్పీ యాదగిరి, తహసీల్దారు అర్చన ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details