వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు ఇబ్బందులు తప్పడం లేదు. కామారెడ్డి జిల్లా మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వారంలో ఒక్క రోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. శిథిలమైన భవనంలో ఆరోగ్య ఉపకేంద్రం, రక్తపరీక్ష కేంద్రంతో పాటు హెచ్ఐవీ పరీక్ష కేంద్రం ఈ భవనంలోనే కొనసాగుతున్నది. మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం, కుర్చీలు లేక... గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూత్ర పరీక్ష కోసం వచ్చిన మహిళలు ఆరు బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
ప్రతివారం వైద్యం కోసం మండలంలోని 40 గ్రామాల మహిళలు వందకుపైగా వస్తుంటారు. వీరందరికి ఒకే వైద్యుడు... ఉండడం వల్ల గంటల తరబడి మహిళలు వేచిఉండాల్సిన పరిస్థితి. ఉదయం వచ్చిన గర్భిణీలు సాయంత్రం వరకు క్యూలైన్లో ఉంటున్నారు.