తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కలు ఎండినందుకు పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన కలెక్టర్ - పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించిన కలెక్టర్ శరత్​

కామారెడ్డి జిల్లా కలెక్టర్ డా.శరత్...​ సదాశివనగర్​ మండలంలో పర్యటించారు. మండలకేంద్రంలో నిర్మిస్తోన్న పల్లె ప్రకృతి వనం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం పద్మాజివాడిలో నిర్మిస్తోన్న రైతు వేదిక పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

prakruthi vanam inspected by kamareddy collector sharath
పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించిన కలెక్టర్ శరత్​

By

Published : Aug 13, 2020, 8:16 PM IST

కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ మండల కేంద్రంలో నిర్మిస్తోన్న పల్లె ప్రకృతి వనం పనులను జిల్లా కలెక్టర్ డా.శరత్​ పరిశీలించారు. పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని కలెక్టర్ అన్నారు. సదాశివనగర్, గాంధారి మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించారు. పద్మాజివాడిలో నిర్మిస్తోన్న రైతు వేదిక పనులను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

భూంపల్లి శివారులో అవెన్యూ ప్లాంటేషన్​లో నాటిన మొక్కలు ఎండినందుకు పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ శరత్ సస్పెండ్ చేశారు. సదాశివనగర్ ఎంపీడీవో, ఎంపీవోలకు ఛార్జి మెమోలు జారీ చేశారు. గుడిమెట్, పోతంగల్​లో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details