వర్షానికి చెరువులు, కుంటలు జలకళ - సింగీతం ప్రాజెక్టు
కామారెడ్డి జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి సెలయేర్లు జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలోని వాగులు, చెరువుల్లో భారీగా నీరు చేరి అన్నదాతలకు ఉపశమనం కలిగించాయి.
![వర్షానికి చెరువులు, కుంటలు జలకళ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3897773-thumbnail-3x2-jalakala.jpg)
పొంగి పొర్లుతున్న వాగులు వంకలు సెలయేర్లు
కామారెడ్డి జిల్లాలోని వాగులు కుంటలు జలమయమయ్యాయి. పది రోజులుగా కనుమరుగైన వర్షాలు..ఇప్పుడిప్పుడు పడుతుండటంతో కుంటలు నిండిపోతున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని ముసళ్ల చెరువు నిండు కుండను తలపిస్తోంది.
జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని సింగీతం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షానికి రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ..వరి నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
పొంగి పొర్లుతున్న వాగులు వంకలు సెలయేర్లు