తెలంగాణ

telangana

By

Published : Oct 29, 2020, 11:06 AM IST

ETV Bharat / state

రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటాం: గంప గోవర్ధన్

రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రభుత్వవిప్ గంపగోవర్ధన్ అన్నారు. కామారెడ్డి జిల్లా గర్గుల్​ గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. దళారులకు నమ్మి రైతులు మోసపోవద్దని అన్నారు.

paddu purchase started in kamareddu by govt chief vip gampa govardhan
రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటాం : గంప గోవర్ధన్

కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. రైతుల నుంచి చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. రైతులు ఎక్కడ కోరుకుంటే అక్కడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు.

జిల్లాలోని రాజంపేట, ఎల్లంపేట్​ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఎల్లంపేట్ గ్రామంలోని మహాలక్ష్మి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ ఛైర్మన్ ప్రేమ్​కుమార్, కామారెడ్డి ఎంపీపీ ఆంజనేయులు, సొసైటీ ఛైర్మన్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మక్కలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు

ABOUT THE AUTHOR

...view details