కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని జీఎంఆర్ గార్డెన్ సమీపంలో ఓ వ్యక్తి బైక్ ఆగిపోయింది. వాహనదారుడు పలుమార్లు ప్రయత్నించినా స్టార్ట్ కాకపోవడం వల్ల విసుగుచెంది బండిలో పెట్రోల్ తీసి దానిపై పోసి తగులపెట్టాడు. అనంతరం శిరస్త్రాణం ధరించి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
'బండి స్టార్ట్ కావడం లేదని పెట్రోల్ పోసి తగులబెట్టాడు' - బైక్పై పెట్రోల్ పోసి తగలబెట్టిన యజమాని
ద్విచక్రవాహనం స్టార్ట్ కాకపోవడంతో విసుగు చెంది ఓ వ్యక్తి ఏకంగా దానిని తగులబెట్టేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
!['బండి స్టార్ట్ కావడం లేదని పెట్రోల్ పోసి తగులబెట్టాడు' owner poured petrol on the two-wheeler and set it on fire in kamareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8557022-920-8557022-1598373641815.jpg)
ద్విచక్రవాహనాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన యజమాని
ఈ ఘటనలో ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోయింది. ఆ వ్యక్తి బానాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు.