Kamareddy Master Plan Issue Updates: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన కామారెడ్డి కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్, అదనపు కలెక్టర్, కమిషనర్ పాల్గొన్నారు. రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలపై చర్చించారు. ప్రజాభిప్రాయం మేరకు మాస్టర్ప్లాన్ రూపొందిస్తామని అరవింద్కుమార్ చెప్పారు. కామారెడ్డిలో విలీనమైన గ్రామాల ప్రజల అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. రైతుల భూమి సేకరించే ఉద్దేశం లేదని అరవింద్ కుమార్ స్పష్టం చేశారు.
మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ను రద్దు చేస్తూ కౌన్సిలర్ల తీర్మానం:కామారెడ్డి మున్సిపల్ కార్యవర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ను రద్దు చేస్తూ కౌన్సిలర్లు తీర్మానాన్ని ఆమోదించారు. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం ప్రత్యేకంగా సమావేశమైన కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. మాస్టర్ ప్లాన్ ముసాయిదా తాము రూపొందించింది కాదని కామారెెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్ జాహ్నవి పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు తీర్మానం పంపుతామని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ కౌన్సిలర్లు ఏకవాక్య తీర్మానం చేశారు. ఈ ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి ఛైర్పర్సన్ జాహ్నవి, కమిషనర్ దేవేందర్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. మున్సిపాలిటీ మాస్టర్ప్లాన్, దిల్లీ కన్సల్టెన్సీ పంపిన మాస్టర్ప్లాన్ వేర్వేరని... మున్సిపల్ ఛైర్పర్సన్ జాహ్నవి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. మాస్టర్ప్లాన్పై 60రోజుల్లో 2,396అభ్యంతరాలు వచ్చాయన్న ఆమె... రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోమని వెల్లడించారు.