తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంపీ అరవింద్​ వ్యాఖ్యలపై స్పందించిన నిజామాబాద్​ డీసీసీబీ ఛైర్మన్​

తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం, ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తే.. సహించేది లేదని ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా డీసీసీబీ ఛైర్మన్​ పోచారం భాస్కర్ అన్నారు. నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అరవింద్​ డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ల విషయంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

By

Published : Jun 28, 2020, 9:43 AM IST

Nizamabad DCCB Chairman Fire On MP Aaravind
ఎంపీ అరవింద్​ వ్యాఖ్యలపై స్పందించిన నిజామాబాద్​ డీసీసీబీ ఛైర్మన్​

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ల విషయంలో అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించేదని లేదని ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా డీసీసీబీ ఛైర్మన్​ పోచారం భాస్కర్​ అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన ప్రెస్​మీట్​లో ఆయన ఎంపీ అరవింద్​పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను తట్టుకొని నిలబడి.. రాష్ట్ర ప్రజల క్షేమం పనిచేస్తున్న తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ల నిర్మాణంలో అధిక శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వానివే అని.. ఎంపీ అరవింద్​ తెలుసుకొని మాట్లాడాలని అన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details