తెలంగాణ

telangana

ETV Bharat / state

సీసీఐ కొనుగోలు కేంద్రాల పునఃప్రారంభం - kamareddy news

కామారెడ్డి జిల్లా మద్నూర్​ పత్తి మార్కెట్​లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హన్మంత్​ షిండే సందర్శించారు. రైతులు తీసుకొచ్చిన పత్తిని పరిశీలించారు.

mla visited cci purchase center in madnooru
సీసీఐ కొనుగోలు కేంద్రాల పునఃప్రారంభం

By

Published : May 13, 2020, 7:30 PM IST

పత్తి రైతులు నష్ట పోకుండా ఉండేందుకే సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని పునఃప్రారంభించామని ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ పత్తి మార్కెట్​లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. రైతులు తీసుకొచ్చిన పత్తిని పరిశీలించారు.

లాక్​డౌన్ కారణంగా ఇన్ని రోజులు కొనుగోలు కేంద్రం మూసి ఉంచారని... రైతుల వద్ద ఇంకా మిగిలిపోయిన పత్తి ఉన్నందున వారికి నష్టం జరగకుండా మళ్లీ ప్రారంభించామన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే హన్మంత్​ షిండే తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా పంజా: 24 గంటల్లో 122 మరణాలు, 3525 కేసులు

ABOUT THE AUTHOR

...view details