కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్లో నూతన రైతు వేదికను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి... కొత్తగా నిర్మించిన 50 డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువనాయకులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మార్గదర్శకులని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూంలు అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
కొత్తరకం పంటలు వేస్తూ రైతులు అభివృద్ధి చెందాలని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. వరి నాటు కాకుండా కొత్తరకం పంటలు, కూరగాయలు పండిస్తే రైతులకు దిగుబడి ఉంటుందని తెలిపారు. రైతులు లాభసాటి పంటలు పండిస్తే మంచి దిగుబడి వస్తుందన్నారు.