కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని బంజారాతండాకు చెందిన ఓ వ్యక్తి గత మూడు రోజలుగా బీపీ ఎక్కువై మతిస్థిమితం కోల్పోయిన వారిగా ప్రవర్తించాడు. కరోనా సోకిందేమోననే అనుమానంతో గురువారం తన పొలంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కొవిడ్ సోకిందనే అనుమానంతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య - నాగిరెడ్డిపేటలో చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
తనకు కరోనా సోకిందేమోననే అనుమానంతో తన పొలంలోని చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని బంజారాతండాలో జరిగింది. ఘటనాస్థలానికి చేరుకుని ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![కొవిడ్ సోకిందనే అనుమానంతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య man died in doubt of corona virus at kamareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:14:22:1597913062-tg-nzb-05-20-chettuku-uresukoni-vyakthi-mruthi-av-ts10111-20082020140937-2008f-1597912777-467.jpg)
కొవిడ్ సోకిందనే అనుమానంతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య
స్థానికుల సమాచారం మేరకు ఎస్సై రాజయ్య ఘటనాస్థలానికి చేరుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.