తెలంగాణ

telangana

By

Published : Apr 29, 2020, 12:50 PM IST

ETV Bharat / state

మద్యం మత్తు.. మితిమీరిన వేగం.. లారీ ప్రమాదం

కామారెడ్డి జిల్లాలో వరి ధాన్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. అదృష్టవశాత్తు లారీ డ్రైవర్​కు, క్లీనర్​కు ఎలాంటి గాయాలు కాలేదు.

LORRY ACCIDENT
అసలే మద్యం మత్తు.. ఆపై మితిమీరిన వేగం...

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తబాది గ్రామ మూల మలుపు వద్ద వరి ధాన్యం లోడుతో వస్తున్న లారీ ఓ చెట్టును ఢీకొట్టి బోల్తా కొట్టింది. నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామం నుంచి బిచ్కుంద మండలం గుండె నెమిలి రైస్ మిల్లుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అదృష్టవశాత్తు డ్రైవర్ ఖాదర్ అనీ, క్లీనర్ నాగేశ్వర్ రావులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో... వాహనాన్ని వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

ఇవీ చూడండి:సాదాసీదాగా తెజస వార్షికోత్సవం

ABOUT THE AUTHOR

...view details