కామారెడ్డి జిల్లాలో లాక్డౌన్ను అధికారులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున... సరిహద్దుల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న జిల్లాలోని మద్నూర్ మండలం సలాబత్పూర్ వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశారు. వచ్చి పోయే వారిని తనిఖీలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని జిల్లాలోనికి అనుమతించడం లేదు. అత్యవసరమైన వాహనాలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నారు. నిరంతరం పోలీసులు, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖల అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు.
కామారెడ్డిలో పకడ్బందీగా లాక్డౌన్
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కామారెడ్డి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల వారిని అనుమతించడం లేదు.
కామారెడ్డిలో పకడ్బందీగా లాక్డౌన్