తెలంగాణ

telangana

ETV Bharat / state

జంతువులపై చిరుత దాడి.. పట్టించుకోని అధికారులు - leopard wandering in ellareddypally

కామారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఎల్లారెడ్డిపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన మేకలు, గొర్రెలపై దాడి చేసింది.

leopard wandering in kamareddy district
ఎల్లారెడ్డిపల్లిలో చిరుత కలకలం

By

Published : Apr 11, 2021, 2:07 PM IST

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లిలో చిరుత సంచారం.. గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామశివారును ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తూ జంతువులపై దాడి చేసి.. వాటిని చంపి తింటోంది. ఇటీవల మేతకు వెళ్లిన 3 మేకలు, ఒక గొర్రెను చంపిందని గ్రామస్థులు తెలిపారు.

ఈ మేరకు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మృతి చెందిన వాటికి పంచనామా నిర్వహించిన అధికారులు.. చిరుతపులిని పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:పోలీసుల కరోనా డ్రైవ్​.. మాస్కు లేనివారికి వెయ్యి ఫైన్​

ABOUT THE AUTHOR

...view details