తెలంగాణ

telangana

కోటి రూపాయలతో అంబేడ్కర్ భవనం నిర్మిస్తాం: పోచారం

By

Published : Jan 22, 2021, 3:14 PM IST

బాన్సువాడలో అంబేడ్కర్ భవన నిర్మాణ స్థలాన్ని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. కోటి రూపాయలతో నియోజవర్గస్థాయి భవనం నిర్మిస్తామని తెలిపారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని పేర్కొన్నారు.

Pocharam Srinivasareddy inspected the construction site of Ambedkar
అంబేద్కర్ భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన పోచారం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నియోజవర్గస్థాయి అంబేడ్కర్ భవన నిర్మాణం కోసం స్థలాన్ని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం ఏన్నో సంక్షేమ పథకాలను అమలు పరిచిందన్నారు.

అన్నీ కులాల వారికి కమ్యూనిటీ హాల్​ను నిర్మించామని తెలిపారు. కోటి రూపాయలతో నియోజవర్గస్థాయి అంబేడ్కర్ భవనం నిర్మిస్తామని స్పీకర్ పేర్కొన్నారు.

ప్రభుత్వం అందిసున్న కళ్యాణ లక్ష్మి పథకంతో లబ్ధిదారులకు ఎలాంటి ఖర్చు లేకుండా అన్నీ వసతులతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజగౌడ్, మున్సిపల్ ఛైర్మన్ గంగాధర్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'పేదలకు రూపాయి ఖర్చులేకుండా.. రోగనిర్ధారణ పరీక్షలు'

ABOUT THE AUTHOR

...view details