కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, బీబీపేట్, మల్కాపూర్ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ ఆకస్మిక పర్యటన చేశారు. గ్రామాల్లో చేపడుతున్న వైకుంఠ ధామం, ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, రైతు వేదిక నిర్మాణాలను పరిశీలించారు.
పనుల్లో వేగం పెంచండి: కలెక్టర్ శరత్ కుమార్
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని గుత్తేదార్లు, అధికారులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ ఆదేశించారు. జిల్లాలోని దోమకొండ, బీబీపేట్, మల్కాపూర్ గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు.
పనుల్లో వేగం పెంచండి: కలెక్టర్ శరత్ కుమార్
త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ప్రకృతి వనాల్లో మియవాకి తరహాలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటాలని సూచించారు. డంపింగ్ యార్డులో తయారు చేసిన ఎరువును రైతులకు అందించాలన్నారు.
ఇదీ చూడండి:టిక్టాక్ సీఈఓ పదవికి కెవిన్ రాజీనామా.. కారణమిదే