తెలంగాణ

telangana

ETV Bharat / state

పనుల్లో వేగం పెంచండి: కలెక్టర్​ శరత్​ కుమార్​

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని గుత్తేదార్లు, అధికారులను కామారెడ్డి జిల్లా కలెక్టర్​ శరత్​ కుమార్​ ఆదేశించారు. జిల్లాలోని దోమకొండ, బీబీపేట్​, మల్కాపూర్​ గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు.

By

Published : Aug 27, 2020, 3:51 PM IST

kamareddy district collector sharath kumar visit villages
పనుల్లో వేగం పెంచండి: కలెక్టర్​ శరత్​ కుమార్​

కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, బీబీపేట్, మల్కాపూర్ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ ఆకస్మిక పర్యటన చేశారు. గ్రామాల్లో చేపడుతున్న వైకుంఠ ధామం, ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, రైతు వేదిక నిర్మాణాలను పరిశీలించారు.

త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ప్రకృతి వనాల్లో మియవాకి తరహాలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటాలని సూచించారు. డంపింగ్ యార్డులో తయారు చేసిన ఎరువును రైతులకు అందించాలన్నారు.

ఇదీ చూడండి:టిక్​టాక్​ సీఈఓ పదవికి కెవిన్​ రాజీనామా.. కారణమిదే

ABOUT THE AUTHOR

...view details