తెలంగాణ

telangana

ETV Bharat / state

నిండుకుండలా మారిన నిజాంసాగర్ ప్రాజెక్టు - Nizam sagar Full water level latest news

వాయుగుండం ప్రభావంతో కామారెడ్డి జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు నీరు వచ్చి చేరుతుంది. ఈ కారణంగా జలాశయం నిండుకుండను తలపిస్తోంది.

Heavy flood water entering the Nijansagar project in Kamareddy district
నిండుకుండలా మారిన నిజాంసాగర్ ప్రాజెక్టు

By

Published : Oct 14, 2020, 8:34 AM IST

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సింగూరు ప్రాజెక్టు ద్వారా 40,829 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తున్నాయి. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులకుగాను 1398.46 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 9.778 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

వరదలు ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుందని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మంజీర పరివాహక ప్రాంతాల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

నిండుకుండలా మారిన నిజాంసాగర్ ప్రాజెక్టు

ఇదీ చదవండి:భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details