తెలంగాణ

telangana

ETV Bharat / state

సామాన్యులు గాంధీకి.. ఎమ్మెల్యేలు యశోదకా..? - కామారెడ్డిలో నిత్యావసరాలు పంపిణీ చేసిన షబ్బీర్ అలీ

రాహుల్​ గాంధీ జన్మదిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్​ హాల్​లో భౌతిక దూరం పాటిస్తూ మాజీ మంత్రి షబ్బీర్​ పేదలకు నిత్యావసరాలను అందజేశారు. కరోనా వస్తే ఎంతటివారైనా గాంధీకి వెళ్లాలన్న కేసీఆర్​... తమ పార్టీ ఎమ్మెల్యేలను మాత్రం యశోదాకు ఎందుకు పంపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

former minister shabbir ali grocery distribution at kamareddy
కామారెడ్డిలో నిత్యావసరాలు పంపిణీ చేసిన షబ్బీర్ అలీ

By

Published : Jun 19, 2020, 5:34 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్​ హాల్​లో రాహుల్​ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకు మాజీ మంత్రి షబ్బీర్​ అలీ నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. భారత్​-చైనా సరిహద్దుల్లో జరిగిన దాడిలో 20 మంది సైనికులు మృత్యువాతపడటం తనను ఎంతో కలచివేసిందని షబ్బీర్​ అలీ అన్నారు. రాష్ట్రానికి చెందిన కర్నల్​ సంతోష్​బాబు మరణిస్తే సీఎం స్వయంగా వెళ్లి నివాళులర్పించలేదని దుయ్యబట్టారు. ఎంతటివారికైనా కరోనా వస్తే గాంధీకి వెళ్లాలని సూచించిన కేసీఆర్​... ఎమ్మెల్యేలకు వస్తే యశోదాకు ఎందుకు పంపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

పేదలకు రూ. 1500 ఆర్థిక సహాయం అందించి.. విద్యుత్​ బిల్లుల ద్వారా సీఎం కేసీఆర్​ వడ్డీ వ్యాపారానికి తెరలేపారని షబ్బీర్​ అలీ ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల పథకం పూర్తి చేయడమే.. తన చిరకాల కోరిక అని.. రెండు లక్షల ఎకరాలకు నీరిచ్చిన తరువాతే తుదిశ్వాస వదులుతానని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి కొంత సమయమిచ్చి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోనున్నట్లు వెల్లడించారు.

ఇదీచూడండి:సీనియర్​ ఐఏఎస్​ అధికారి బీపీ విఠల్ కన్నుమూత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details