కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వేల్పుగొండలోని చెరువులో చేపలు మంగళవారం మృతి చెందాయి. జిల్లా అధికారులకు సమాచారం అందించగా.. బుధవారం ఉదయం జిల్లా మత్స్యశాఖ అధికారిణి పూర్ణిమ.. చెరువును పరిశీలించారు. చెరువును ఆనుకుని ఉన్న పొలంలో క్రిమిసంహారక మందు పిచికారీ చేయడం వల్ల.. మందు చెరువు నీటిలో కలిసి చేపలు మృతి చెందాయన్నారు.
క్రిమి సంహారక మందు శాతం ఎక్కువై చెరువులో చేపలు మృతి - velpugonda fish death
కామారెడ్డి జిల్లా వేల్పుగొండ చెరువు సమీపంలోని పొలంలో క్రిమిసంహారక మందు పిచికారీ చేయగా.. అది చెరువులో కలిసి చేపలు మరణించాయి. బుధవారం చెరువును పరిశీలించిన మత్స్యశాఖ అధికారిణి.. నీటిలో 50 కేజీల బెల్లం, 50 కేజీల ఆవు పేడ మిశ్రమం కలపితే క్రిమిసంహారక మందు తీవ్రత తగ్గుతుందని సూచించారు.
![క్రిమి సంహారక మందు శాతం ఎక్కువై చెరువులో చేపలు మృతి fishery officervisited velpugonda river](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8738669-123-8738669-1599652471118.jpg)
క్రిమి సంహారక మందు శాతం ఎక్కువై చెరువులు చేపలు మృతి
పొలంలో వేసిన క్రిమిసంహారక మందు తీవ్రత పరీక్ష కోసం నీటిని సేకరించి మత్స్యశాఖ అధికారులు పరీక్షించారు. నీటి పీహెచ్ విలువ 8.1గా ఉందని.. అమ్మోనియా శాతం 0.1 ఉందని ఆమె తెలిపారు. నీటిలో క్రిమిసంహారక మందు తీవ్రతను నశింపజేయడానికి నీటిలో 50 కేజీల బెల్లం, 50 కేజీల ఆవు పేడ మిశ్రమం కలపాలని మత్స్యకారులకు సూచించారు.