కామారెడ్డి జిల్లా గాంధారి మండలకేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం వానాకాలం ప్రారంభమవగా పంటలు వేయడానికి ఉదయం నుంచే బారులు తీరారు. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్నా కరోనా వస్తుందనే భయం లేకుండా యూరియా బస్తాల కోసం భౌతికదూరం మరచి క్యూలైన్లలో నిలబడ్డారు.
గాంధారిలో యూరియా కోసం బారులు తీరిన రైతులు - farmers standing in queue without physical distance for urea at gandhari
ప్రభుత్వం సబ్సిడీలో అందించే యూరియా కోసం కామారెడ్డి జిల్లా గాంధారి మండలకేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడి ఎదురుచూసినా.. కొందరికి మాత్రమే యూరియా అందింది. అందని వారు నిరాశతో వెనుదిరిగారు.
గాంధారి వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు
ప్రైవేటులో కంటే ప్రభుత్వం అందించే యూరియా సబ్సిడీలో వస్తుందనే ఆశతో గంటల తరబడి ఎదురుచూశారు. లారీ రాగానే రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. 450 బస్తాలు మాత్రమే రాగా.. దొరికిన వారు తీసుకుని మిగతా వారు నిరాశతో ఇళ్ల బాట పట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. మండలంలో ఉన్న రైతులందరికీ సరిపడా యూరియాను అందించాలని కోరుతున్నారు.