తెలంగాణ

telangana

ETV Bharat / state

పొలం కోసం సెల్​టవర్​ ఎక్కి రైతు హల్​చల్​ - farmer climbed the cell tower news

తన భూమిని ఆక్రమించడానికి కొందరు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా తిప్పాపూర్​లో ఓ రైతు సెల్​ టవర్​ ఎక్కి హల్​చల్​ సృష్టించాడు. పోలీసులు రావడంతో ఆందోళన సద్దుమణిగింది.

farmer climbed the cell tower
సెల్​టవర్​ ఎక్కిన రైతు

By

Published : May 8, 2021, 7:09 AM IST

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో ఓ రైతు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. గ్రామానికి చెందిన రైతు ఇల్లెందుల సత్యం.. తన వ్యవసాయ భూమిని ఆక్రమించడానికి సర్పంచ్ స్వామి యత్నిస్తున్నారని ఆరోపించాడు.

ఆయన అనుచరులతో కలిసి దాడి చేశారని వాపోయాడు. తనకు న్యాయం జరిగే వరకు టవర్​ దిగేది లేదని చెప్పడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. న్యాయం చేస్తామని పోలీసులు చెప్పడంతో కిందకు దిగాడు.

ఇదీ చదవండి:కరీంనగర్​ జిల్లాలో పెరిగిన ఆక్సిజన్​ వినియోగం

ABOUT THE AUTHOR

...view details