కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ సదాశివనగర్ మండలం పరిధిలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. మండలంలోని పద్మాజివాడి, భూంపల్లి, గాంధారి గ్రామాలలో అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని కోరారు.
మొక్కలను సంరక్షించండి: కలెక్టర్ శరత్ - kamareddy district sadashivnagar
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిధిలోని అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ శరత్ పరిశీలించారు. మొక్కల సంరక్షణకు పలు సూచనలు చేశారు.
![మొక్కలను సంరక్షించండి: కలెక్టర్ శరత్ kamareddy collector, sharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11179555-240-11179555-1616833558191.jpg)
కామారెడ్డి కలెక్టర్, శరత్
భూంపల్లి గుట్టపై ఉన్న పల్లె ప్రకృతి వనంను సందర్శించి సంబంధిత నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
ఇదీ చదవండి:దిల్లీ ఎయిమ్స్కు రాష్ట్రపతి కోవింద్!