తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టణ ప్రగతిలో పాల్గొన్న కలెక్టర్ శరత్ కుమార్

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 45, 46వ వార్డుల్లో కలెక్టర్ శరత్ కుమార్ పర్యటించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని నిరంతరం కొనసాగించాలని తెలిపారు.

By

Published : Mar 3, 2020, 7:24 PM IST

kamareddy collector sharath kumar
పట్టణ ప్రగతిలో పాల్గొన్న కలెక్టర్ శరత్ కుమార్

పట్టణ ప్రగతిలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 45, 46వ వార్డుల్లో కలెక్టర్ శరత్ కుమార్ పర్యటించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలున్నాయని కాలనీవాసులు చెప్పడం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అభివృద్ధిని నిరంతరం కొనసాగాలని స్వచ్ఛ పట్టణాలుగా మార్చాలని తెలిపారు. మురుగు కాలువలను సక్రమంగా శుభ్రపరచాలని పేర్కొన్నారు. 45 వ వార్డులో గల మటన్ మార్కెట్​ను పర్యవేక్షించి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

పట్టణ ప్రగతిలో పాల్గొన్న కలెక్టర్ శరత్ కుమార్

ఇవీ చూడండి:పసివాడి శరీరంలో 12 సూదులు.. ఎలా తట్టుకున్నాడో పాపం.!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details