కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలోని కొవిడ్ వార్డును, ఐసీయూ వార్డును జిల్లా కలెక్టర్ శరత్కుమార్ తనిఖీ నిర్వహించారు. కొవిడ్ వార్డుల ముందు సెక్యూరిటీని పెంచాలని ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటిస్తూ… వైద్యం అందించాలని ఆసుపత్రి కో ఆర్డినేటర్ అజయ్ కుమార్కు సూచించారు.
కొవిడ్ వార్డును తనిఖీ చేసిన కలెక్టర్ - collector inspection covid ward in kamareddy government hospital
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ వార్డును కలెక్టర్ శరత్కుమార్ తనిఖీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.
![కొవిడ్ వార్డును తనిఖీ చేసిన కలెక్టర్ collector inspection covid ward in kamareddy government hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:29:42:1619265582-tg-nzb-45-24-collector-inspection-av-ts10142-24042021172138-2404f-1619265098-272.jpg)
collector inspection covid ward in kamareddy government hospital
జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 26 శాతం నుంచి 18 శాతం వరకు తగ్గిందని తెలివారు. జిల్లా సరిహద్దుల్లో రాకపోకలను తగ్గించినట్లు వెల్లడించారు. మే 1 లోగా 45 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ వేసుకోవాలని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి