కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గున్కూల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో జరిగిన చిన్న గొడవ ఈ ఘర్షణకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గ్రామ సర్పంచ్ భర్తను అరెస్టు చేశారు.
మద్యం మత్తులో గొడవ.. ఇరువర్గాల ఘర్షణ - kamareddy district crime news
మద్యం మత్తులో జరిగిన చిన్న గొడవ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గ్రామ సర్పంచ్ భర్తను అరెస్టు చేశారు.
![మద్యం మత్తులో గొడవ.. ఇరువర్గాల ఘర్షణ clash between two factions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11246825-1108-11246825-1617333052377.jpg)
ఇరువర్గాల ఘర్షణ
ఈ అరెస్టుకు నిరసనగా నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తెరాసకు చెందిన ఓ జిల్లా ప్రజాప్రతినిధి చెప్పే మాటలు విని.. సర్పంచ్ భర్తను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: ఉస్మానియా ఆస్పత్రిలో బిడ్డను వదిలేసి వెళ్లిన తల్లి