తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి నిరంజన్​రెడ్డిని అడ్డుకున్న భాజపా కార్యకర్తలు - తెలంగాణ వార్తలు

కామారెడ్డి జిల్లా మద్నూర్​ మండల కేంద్రంలో భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రైతు వేదికను ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డిని అడ్డుకునేందుకు యత్నించగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

BJP activists stopped Minister Niranjan Reddy at madnoor in kamareddy district
మంత్రి నిరంజన్​రెడ్డిని అడ్డుకున్న భాజపా కార్యకర్తలు

By

Published : Feb 21, 2021, 7:58 PM IST

కామారెడ్డి జిల్లా మద్నూర్​ మండల కేంద్రంలో రైతు వేదికను ప్రారంభించేందుకు వచ్చిన వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డిని భాజపా నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ కార్యక్రమం వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు.

రైతు వేదికలపై ప్రధాన మంత్రి ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారు. తెరాసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు.

ఇదీ చూడండి: ఎలక్ట్రానిక్ పరిశ్రమలో పేలుడు.. కార్మికురాలు మృతి

ABOUT THE AUTHOR

...view details