కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్ సీఐ టాటా బాబు అవినీతి బాగోతం బయటపడింది. నసురుల్లాబాద్ మండలంలోని పోలీస్ స్టేషన్లో ఓ సివిల్ కేసు విషయంలో గుత్తేదారు ప్రతాప్ సింగ్ను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు 50 వేలు డిమాండ్ చేశారు.
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన సీఐ - కామారెడ్డి జిల్లా నేర వార్తలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రూరల్ సీఐ టాటా బాబు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ సివిల్ కేసు విషయంలో గుత్తేదారును అరెస్టు చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు అనిశా అధికారులను సంప్రదించగా, సీఐని అదుపులోకి తీసుకున్నారు.
![లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన సీఐ ACB arrested by correpted rural CI to damanding money in civil case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9152202-516-9152202-1602523561324.jpg)
లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడిన సీఐ
చివరికి రూ.20 వేలకు ఒప్పందం కుదరడంతో మొదట పదివేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. బాధితునికి లంచం ఇవ్వడం ఇష్టంలేక అనినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీంతో బాధితుడు పదివేలు ఇస్తుండగా సీఐని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ రవి ప్రకాష్ తెలిపారు.