తెలంగాణ

telangana

By

Published : Nov 22, 2019, 10:01 PM IST

ETV Bharat / state

కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులకు అస్వస్థత

బిచ్కుందలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం, తాగునీటి వల్ల 60 మంది విద్యార్థులు  అస్వస్థతకు గురయ్యారు. ప్రిన్సిపాల్​, ఉపాధ్యాయులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులకు అస్వస్థత

కామారెడ్డి జిల్లా బిచ్కుందలో మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది చికిత్స అందించారు. అందులో పదిమందికి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. కలుషిత ఆహారం, తాగునీటి వల్లే ఇలా జరిగినట్లు వైద్యులు తెలిపారు.

కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులకు అస్వస్థత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details